Chandrababu : తాడేపల్లిలో వృద్ధుడు, మహిళలపై నాగిరెడ్డి దాడిని ఖండించిన చంద్రబాబు, లోకేష్
Chandrababu : ఏపీ సీఎం జగన్ నివసించే తాడేపల్లిలోనే సామాన్యులకు న్యాయం దక్కడంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు.
Chandrababu : ఏపీ సీఎం జగన్ నివసించే తాడేపల్లిలోనే సామాన్యులకు న్యాయం దక్కడంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. ప్రైవేటు వివాదంలో తలదూర్చి... వృద్డుడు, మహిళలపై దాడికి దిగిన నాగిరెడ్డి బరితెగింపును ఖండించారు. అధికార మందతో ప్రేటేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు అంటూ లోకేష్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. వైసీపీ నాయకులు భూకబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే.. మేమేమైనా తక్కువ తిన్నామా అన్నట్లు సాక్షి సిబ్బంది దాష్టీకం ప్రదర్శిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు. వైసిపి నాయకులు
— Lokesh Nara (@naralokesh) April 30, 2022
భూ కబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు సాక్షి సిబ్బంది. మంగళగిరి నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్ నాగి రెడ్డి దాష్టీకం చూస్తుంటే..(1/3) pic.twitter.com/jIsTYvHbRB