Chandragiri : చంద్రగిరిలో లక్ష 24 వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ..
Chandragiri : పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టారు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
Chandragiri : పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టారు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. లక్షా 24వేల మట్టి వినాయక విగ్రహాలను తయారీకి శ్రీకారం చుట్టారు. చంద్రగిరి నియోజక వర్గంలో విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. పాత సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని, వాటిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రతి ఏటా,ప్రతి ఇంట్లో మట్టి విగ్రాహాలను పూజించే విధంగా ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోందని,25 ప్రాంతాల్లో దాదాపు ఏడువందల మంది కార్మికులతో మట్టి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. కాలుష్యం నుంచి కాపాడేందుకు మట్టి విగ్రహాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.