FLIGHT CRASH: తీవ్రంగా కలచి వేసింది: పవన్కల్యాణ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సినీ ప్రముఖల తీవ్ర ఆవేదన;
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత విషాదకరమని, ఊహించలేనిదని ఆయన గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విమానం సమీపంలోని వైద్య కళాశాల వసతిగృహ భవనాలపై కూలిపోవడం పెను విషాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురై 200మందికిపైగా ప్రయాణికులు, విమాన సిబ్బంది మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీనిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమను ఎంతగానో కలచి వేస్తోందని పేర్కొంటూ సోషల్మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.**
టాలీవుడ్ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాలీవుడ్లోని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర విమాన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డానని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఈ ఘటన యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు, మంచు మనోజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.