విశాఖపట్నం తీరంలో రింగుల వలలతో చేపలవేట వివాదానికి తారి తీసింది. పెద జాలరిపేట తీరంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోలీసుల్ని మోహరించారు. సంప్రదాయ మత్స్యకారులంతా సముద్రంలో నాటు పడవలు మోహరించి రింగుల వలలతో వేటను అడ్డుకుంటామంటున్నారు. ఈ వలలతో చేపల్ని పట్టి తమ ఉపాధికి గండి కొట్టవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఏసీపీ మూర్తి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి వివాదం పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామంటున్నారు.