విజయనగరం జిల్లాలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నగజరాజులు

Update: 2020-11-02 07:49 GMT

విజయనగరం జిల్లాలో గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొమరాడ మండలం బంగారంపేట-కోమట్లపేట అంతర్రాష్ట్ర రహదారిపై ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ప్రతిరోజు సాయంత్రం నాలుగు తరువాత రోడ్లపై ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటువైపు వెళ్లాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు.

ఇటీవలే ఏనుగుల దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఏనుగుల గుంపు జనవాసాల్లోకి రావడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఏనుగుల సంచారంతో రోజు చస్తూ బతుకుతున్నామని.. ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రజలు ఏనుగులను తమ ఊళ్లోకి రాకుండా తరిమే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News