Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్..
Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కుప్పం మండలం గణేష్పురంలోని పంటపొలాల్లోకి ఏనుగుల మంద చొరబడింది;
Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కుప్పం మండలం గణేష్పురంలోని పంటపొలాల్లోకి ఏనుగుల మంద చొరబడింది. పంటపొలాల వద్ద కాపలా ఉన్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. రైతు రామలింగం పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకొని ఏనుగులను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.