ఏపీలో ఎస్పీ, కలెక్టర్ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఏపీలో ఎస్పీ, కలెక్టర్ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి;
దళితుల శిరోముండనం ఘటనలు రాష్ట్రానికి అవమానకరమని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అణగారిన వర్గాలకు అండగా ఉండాల్సిన SP, కలెక్టర్ వ్యవస్థలు రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయాయని ఆయన ఆరోపించారు. సీఎం స్థాయిలో జగన్ కఠిన చర్యలు తీసుకోలేదు కాబట్టే ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. భూములు, ఇళ్ల స్థలాల విషయంలో దళితులను రెవెన్యూ అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. దళితులకు 20 వేల కోట్లు ఖర్చు పెడితే... ఆ వర్గం శిరోముండనం చేయించుకోవాలా అంటూ ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ఇస్తే అవమానాలు భరించాలా అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.