SAD: సూదీ మందు ఇచ్చి తల్లిదండ్రులను చంపిన కూతురు

వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన... తల్లిదండ్రులను చంపిన కూతురు.. ప్రేమకు అడ్డు వస్తారని ఘాతుకం..సూదీమందు ఇచ్చి తల్లిదండ్రుల హత్య

Update: 2026-01-29 05:30 GMT

డు­పు­లో మోసి, ప్రా­ణం­గా పెం­చిన కూ­తు­రు… చి­వ­ర­కు అదే చే­తు­ల­తో ప్రా­ణా­లు తీ­స్తుం­ద­ని ఆ తల్లి­దం­డ్రు­లు ఊహిం­చ­లే­క­పో­యా­రు. తె­ల్ల­వా­రి­తే పె­ళ్లి చూ­పు­లు జర­గా­ల్సిన ఆ ఇం­ట్లో మృ­త్యు ఘోష వి­ని­పిం­చిం­ది. ప్రేమ పే­రు­తో మత్తు­లో ము­ని­గిన ఓ కూ­తు­రు.. తన ప్రే­మ­కు అడ్డు­గా ఉన్నా­ర­న్న ఆగ్ర­హం­తో కన్న­త­ల్లి­దం­డ్రు­ల­నే చం­పే­సిం­ది. సూ­ది­మం­దు ఇస్తా­న­ని చె­ప్పిన కూ­తు­రు మా­ట­లు నమ్మిన తల్లి­దం­డ్రు­లు... అదే సూ­ది­లో దాగి ఉన్న మర­ణా­న్ని గు­ర్తిం­చ­లే­క­పో­యా­రు. తె­ల్ల­వా­రి­తే పె­ళ్లి చూ­పు­లు జర­గా­ల్సిన ఆ ఇం­ట్లో, తె­ల్ల­వా­ర­క­ముం­దే రెం­డు ప్రా­ణా­లు ఆరి­పో­యా­యి. వి­కా­రా­బా­ద్ జి­ల్లా­లో చో­టు­చే­సు­కు­న్న ఈ దా­రు­ణం … ప్రేమ పే­రు­తో జరి­గే అఘా­యి­త్యా­లకు సా­క్ష్యం­గా ని­లి­చిం­ది. వి­కా­రా­బా­ద్ జి­ల్లా యా­చా­రం గ్రా­మం­లో జరి­గిన ఘోర హత్య కే­సు­లో కు­మా­ర్తె­నే నిం­ది­తు­రా­లి­గా పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు. సం­గా­రె­డ్డి­లో­ని ఓ ప్రై­వే­ట్ ఆసు­ప­త్రి­లో నర్సు­గా పని­చే­స్తు­న్న సు­రేఖ, తన ప్రేమ పె­ళ్లి­కి తల్లి­దం­డ్రు­లు అం­గీ­క­రిం­చ­ర­న్న భయం­తో ఈ అఘా­యి­త్యా­ని­కి పా­ల్ప­డి­న­ట్లు దర్యా­ప్తు­లో తే­లిం­ది. పె­ళ్లి చూ­పు­ల­కు ముం­దు రోజు రా­త్రి తల్లి­దం­డ్రు­ల­కు సూ­ది­మం­దు ఇస్తా­న­ని చె­ప్పి, విషం కలి­పిన ఇం­జె­క్ష­న్‌­ను ఇచ్చి హత్య చే­సి­న­ట్లు పో­లీ­సు­లు వె­ల్ల­డిం­చా­రు. మృ­తు­లు దశ­ర­థ్, లక్ష్మి దం­ప­తు­లు. వీ­రి­కి ఒక కు­మా­రు­డు, ము­గ్గు­రు కు­మా­ర్తె­లు ఉన్నా­రు. సు­రేఖ చి­న్న కూ­తు­రు కాగా, ఆమె కొం­త­కా­లం­గా ఓ యు­వ­కు­డి­తో ప్రే­మ­లో ఉన్న­ట్లు సమా­చా­రం. ఆ ప్రే­మ­కు కు­టుంబ సభ్యు­లు ఒప్పు­కో­ర­న్న భా­వ­న­తో­నే ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు పో­లీ­సు­లు పే­ర్కొ­న్నా­రు.

ఇం­జె­క్ష­న్ ఇచ్చిన తర్వాత తల్లి­దం­డ్రు­లు స్పృహ తప్పి పడి­పో­యా­ర­ని నటి­స్తూ, సు­రేఖ తన అన్న అశో­క్‌­కు ఫోన్ చేసి సమా­చా­రం ఇచ్చిం­ది. వెం­ట­నే ఇం­టి­కి చే­రు­కు­న్న అశో­క్, తల్లి­దం­డ్రు­లు అను­మా­నా­స్ప­దం­గా మృతి చెం­ది­న­ట్లు గమ­నిం­చి పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­శా­డు. కేసు నమో­దు చే­సిన పో­లీ­సు­లు, మృ­త­దే­హా­ల­ను పో­స్టు­మా­ర్టం ని­మి­త్తం తర­లిం­చి దర్యా­ప్తు ప్రా­రం­భిం­చా­రు. పో­లీ­సుల వి­చా­ర­ణ­లో కీలక ఆధా­రా­లు లభిం­చా­యి. ఇం­ట్లో లభిం­చిన ఇం­జె­క్ష­న్లు, వై­ద్య­ప­ర­మైన వి­వ­రాల ఆధా­రం­గా అను­మా­నం సు­రే­ఖ­పై­కి మళ్లిం­ది. ప్ర­శ్నిం­చ­గా, తానే తల్లి­దం­డ్రు­ల­ను హత్య చే­సి­న­ట్లు సు­రేఖ ఒప్పు­కు­న్న­ట్లు పో­లీ­సు­లు తె­లి­పా­రు. ఆమె ఉప­యో­గిం­చిన ఇం­జె­క్ష­న్ల­ను స్వా­ధీ­నం చే­సు­కు­ని, నిం­ది­తు­రా­లి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.

ఈ ఘటన గ్రా­మం­లో తీ­వ్ర కల­క­లం రే­పిం­ది. పె­ళ్లి చూ­పు­ల­కు ఏర్పా­ట్లు జరు­గు­తుం­డ­గా­నే చో­టు­చే­సు­కు­న్న ఈ వి­షా­దం స్థా­ని­కు­ల­ను ది­గ్భ్రాం­తి­కి గు­రి­చే­సిం­ది. ప్రేమ పె­ళ్లి వి­ష­యం­లో కు­టుంబ వి­భే­దా­లు ప్రా­ణాం­తక పరి­ణా­మా­ల­కు దా­రి­తీ­స్తు­న్నా­య­న్న ఆం­దో­ళ­న­ను ఈ కేసు మరింత బల­ప­రి­చిం­ది.ప్రస్తుతం నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News