వ్యాపారంలో జగన్‌ ఎన్ని తప్పులు చేయాలో.. అన్నీ చేశారు : మాజీఎంపీ ఉండవల్లి

Update: 2020-10-17 08:47 GMT

న్యాయవ్యవస్థకు, శాసనవ్యవస్థకు సంబంధాలు దెబ్బతింటే... రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. సీజేఐకి జగన్‌ రాసిన లేఖను ప్రచారం కోసమే బయట పెట్టారని అభిప్రాయం వ్యక్తంచేశారు. కోర్టుల పరువు తీయడం వల్ల ఏమైనా జరుగుతుందా? అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై ఇప్పుడు జరుగుతున్న చర్చ హుందాగా జరగాలని ఉండవల్లి హితవు పలికారు. వ్యాపారంలో జగన్‌ ఎన్ని తప్పులు చేయాలో.. అన్ని తప్పులు చేశార అన్నారు. చట్టబద్ంగా చేయాల్సింది చేయకపోవడం వల్ల... కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇస్తున్నాయని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అమరావతిలో జడ్జిల కూతుళ్లు భూములు కొంటే తప్పేంటి ? అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News