నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం నివర్ తుఫాన్గా మారింది. బంగాళాఖాతం వద్ద పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా, చెన్నైకి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి సమీపంలో రేపు తీరం తుఫాన్ దాటనుంది. తీరం దాటే సమయంలో తీవ్ర తుఫాన్గా మారనుంది. గంటకు 100 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.