విజయవాడ దుర్గగుడిలో సింహం విగ్రహాల మాయంపై జనసేన ఆందోళనకు దిగింది. దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి ఇంటి ముందు జనసేన కార్యకర్తలు ధర్నా చేశారు. జనసేన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి రాజీనామా చేయాలని జనసేన కార్యకర్తల డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.