West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో వరద బీభత్సం.. మునిగిన లంక గ్రామాలు
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం లంక గ్రామాలు వరద ముంపులో మునిగిపోయాయి.
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం లంక గ్రామాలు వరద ముంపులో మునిగిపోయాయి. నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు అందక జనం అల్లాడిపోతున్నారు. మనిషి చనిపోతే అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా లేదు.
ప్రభుత్వాలు మారినా, అధికారులు వచ్చిపోతున్నా.. తమ గోడు వినిపించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతకాలం బతకాలని, ఇలాంటి జీవనం సాగించాలంటే చాలా సిగ్గుగా ఉందని చెబుతున్నారు.
ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని లంక గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.