లారీ డ్రైవర్పై దాడి చేసిన చిరుత.. అక్కడే ఓ ఆవును చూసి..
లారీ డ్రైవర్పై దాడి చేసి.. పక్కనే ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని చిరుత తప్పించుకుంది.;
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మరోసారి చిరుత పులి కలకలం రేపుతోంది. గగన్పహాడ్లోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో.. నడి రోడ్డుపై చిరుత నిద్రిస్తూ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
చిరుతను బంధించేందుకు.. అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత లారీ డ్రైవర్పై దాడి చేసి.. పక్కనే ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని చిరుత తప్పించుకుంది. అక్కడే ఓ ఆవుపై దాడి చేసినట్టు.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజేంద్రనగర్తోపాటు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్, చుట్టుగొల్లపల్లి, మామిడిపల్లి ప్రాంతాల్లో చిరుతలు సంచరించడంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారుల త్వరగా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.