LOKESH: ఏఐతో ఉద్యోగాలు పోవు: లోకేశ్

మన మిత్ర వేదిక ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్న లోకేశ్;

Update: 2025-07-24 03:30 GMT

వి­జ­య­వా­డ­లో జరు­గు­తు­న్న ఇన్వె­స్టో­పి­యా గ్లో­బ­ల్ సమ్మి­ట్‌–2025లో ఏపీ ఐటీ­శాఖ మం­త్రి నారా లో­కే­ష్‌ పా­ల్గొ­న్నా­రు. ప్ర­స్తు­తం ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ఏఐ టె­క్నా­ల­జీ­ని అను­స­రి­స్తూ హ్యా­క­థా­న్‌­లు ని­ర్వ­హి­స్తోం­ది అని మం­త్రి లో­కే­ష్ పే­ర్కొ­న్నా­రు. ఏఐ వల్ల ఉద్యో­గా­లు పో­తా­య­నే భయం కొం­ద­రి­లో ఉంది. కానీ, పా­రి­శ్రా­మిక వి­ప్ల­వం తరు­వాత ఉద్యో­గా­లు ఎలా పె­రి­గా­యో మనం చూ­శా­మ­న్నా­రు. మన మి­త్ర ప్లా­ట్‌­ఫా­ర­మ్ ద్వా­రా ప్ర­జ­ల­కు ప్ర­భు­త్వం మరింత మె­రు­గైన సే­వ­లు అం­ది­స్తోం­ద­న్నా­రు.

జనవరిలో ఆవిష్కృతం

దక్షిణాసియాలో తొలి 152 బిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటయ్యే వ్యాలీలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందని, ఇది మొత్తం ఎకో సిస్టమ్‌ను మార్చబోతోందని తెలిపారు. విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. పలు ప్రఖ్యాత సంస్థలు విశాఖలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యలో ఏఐ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెడుతున్నామన్నారు. పరిపాలనలోనూ ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోరని, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని చెప్పారు. 

Tags:    

Similar News