పార్టీలు మారడంపై టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స స్పందించారు. వైఎస్ తండ్రి మరణం తర్వాతి పరిస్థితుల్లో ఆయన కొత్త పార్టీ పెట్టారన్నారు. తనతోపాటు ఇక్కడున్న చాలా మంది పార్టీలు మారారని అన్నారు. అయితే ప్రజామోదంతో మళ్లీ గెలిచామని.. కవర్ చేసుకున్నారు.