MODI: ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధం

రేపు విశాఖ పట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు;

Update: 2025-06-20 01:30 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. రేపు విశాఖ పట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మోదీ భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం చేరుకుని, తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ఆర్కే బీచ్‌లో ఉదయం 6:30 నుండి 7:45 వరకు జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి దాదాపు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. శనివారం (21న) ఉదయం 6:30 నుంచి 7:45 గంటల వరకు విశాఖపట్నం సాగరతీరంలోని ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. అనంతరం ఉదయం 11:50 గంటలకు విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళతారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.

భారీ ఏర్పాట్లు సిద్ధం

ప్రధాని మోదీహాజరవుతుండటంతో విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షలు మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.. వారందరు యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఆర్కే బీచ్‌లో ప్రతి వెయ్యి మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి.. ఒక యోగా ట్రైనర్‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

యోగా డే ఎలా మొదలైంది?

2014 సెప్టెంబర్ 27న ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ‘యోగా దినోత్సవం’ గురించి ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 193 ఐక్యరాజ్య సమితి ప్రతినిధులకు గానూ 175 మంది మద్దతు ఇచ్చారు. దీన్ని డిసెంబర్ 2014లో ఆమోదించారు. 2015 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. కాబట్టి ఆరోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించారు. ప్రధాని మోదీ సాగర తీర ప్రాంతంలో యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. యోగా డే సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ యోగా డే సెలబ్రేషన్స్ విశాఖ వాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి మరో నలుగురు ఐఏఎ్‌సలను నియమిస్తూ సీఎస్‌ విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. యోగాంధ్రకు ప్రజలను సమీకరించేందుకు ఇప్పటికే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డా. మల్లికార్జునను ప్రభుత్వం నియమించింది.

Tags:    

Similar News