కలుషిత నీటితో.. విశాఖ వాసుల దాహార్తికి ఇక్కట్లు
విశాఖ వాసుల దాహార్తి తీర్చే ముడసర్ లోయ రిజర్వాయర్ కలుషితమైపోయింది.
విశాఖ వాసుల దాహార్తి తీర్చే ముడసర్ లోయ రిజర్వాయర్ కలుషితమైపోయింది. జలాశయం చెత్తాచెదారం, వ్యర్థాలతో నిండిపోవడంతో దుర్వాసన వస్తోంది. నిర్వాహణ లోపం కారణంగా ఫిల్టరేషన్ ప్లాంట్ వాడుకలో లేకుండా పోయింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ముడసర్ లోయ ప్లాంట్ను టీడీపీ నాయకులు పరిశీలించారు. జీవీఎంసీ అధికారులు ఫిల్టర్ చేయకుండానే కలుషిత నీటిని ప్రజలకు అందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.