LAVANYA: రాజ్తరుణ్ తల్లిదండ్రులను గెంటేసిన లావణ్య
పోలీసులతో మాట్లాడాకే ఇంట్లోకి రావాలన్నలావణ్య;
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కోకాపేటలో రాజ్ తరుణ్ ఇంట్లో నివసిస్తున్న లావణ్య వద్దకు అతని తల్లిదండ్రులు లగేజ్ తో సహా వెళ్లారు. ఇల్లు తమదంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ ఎవరి ఇల్లు లేదంటూ వారిని అడ్డుకుంది. అంతేకాకుండా వారు ఇంట్లోకి ప్రవేశించడాన్ని నిరాకరించింది.దీంతో రాజ్ తరుణ్ కుటుంబసభ్యులు విల్లా ముందు ధర్నాకు దిగారు. ఆ విల్లా తమదే అని, తమ కుమారుడు కష్టపడి సినిమాలు చేసిన డబ్బులతో ఈ ఇల్లు కొన్నాడని తెలిపారు. ఈ ఇంటిపై లావణ్యకు ఎలాంటి హక్కులు లేవని చెబుతున్నారు. అనంతరం లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ తాను కలిసి ఈ ఇల్లు కొన్నామని.. ఇందుకు తాను రూ.70 లక్షలు ఇచ్చినట్లు పేర్కొంది. రాజ్ తరుణ్ తో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు... అతడు తనతో ఉంటాడని డబ్బులన్నీ తనకు ఇచ్చినట్టు తెలిపింది. ఇప్పడు అతడి తల్లిదండ్రులు ఈ ఇంటితో తనకు సంబంధం లేదంటున్నారని.. ఈ ఇంటిపై రాజ్తరుణ్ తో పాటు తనకు సమాన హక్కులు ఉన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా లావణ్యపై రాజ్తరుణ్ తల్లిదండ్రులు కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లావణ్యపైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది వీరిద్దరి మధ్య మెుదలైన గొడవతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం రాజ్తరుణ్పై పెట్టిన కేసులు లావణ్య వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను లోబరుచుకుంటుంన్నాడని లావణ్య తెలిపింది.
రాజ్తరుణ్పై కేసు
రాజ్తరుణ్ తనతో సహజీవనం చేసి వదిలేసాడంటూ లావణ్య గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామిద్దరం విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని.. మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లిన సమయంలో తనా దుస్తులు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది.