PAWAN; తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి

కొండగట్టు అంజన్న దర్శనానికి పవన్... కొండగట్టు పునర్జన్మనిచ్చిందన్న పవన్.. అభివృద్ధి పనులకు పవన్ భూమిపూజ

Update: 2026-01-03 13:30 GMT

తె­లం­గాణ ప్ర­జ­ల­కు కొ­త్త నా­య­క­త్వం అవ­స­ర­మ­ని, ఆ మా­ర్పు గ్రామ స్థా­యి నుం­చే ప్రా­రం­భం కా­వా­ల­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ఉప ము­ఖ్య­మం­త్రి, జన­సేన పా­ర్టీ అధ్య­క్షు­లు పవన్ కల్యా­ణ్ స్ప­ష్టం చే­శా­రు. పం­చా­య­తీల నుం­చే అభి­వృ­ద్ధి ప్ర­స్థా­నం మొ­ద­ల­వు­తుం­ద­ని పే­ర్కొ­న్న ఆయన, సర్పం­చు­లు, వా­ర్డు మెం­బ­ర్లు­గా గె­లు­పొం­ద­డం ఎంతో కీ­ల­క­మైన తొలి అడు­గు­గా అభి­వ­ర్ణిం­చా­రు. ఎంత పె­ద్ద ప్ర­యా­ణ­మై­నా ఒక్క అడు­గు­తో­నే మొ­ద­ల­వు­తుం­ద­ని, ఈ రోజు వే­సిన అడు­గు తె­లం­గా­ణ­లో సరి­కొ­త్త మా­ర్పు­కు నాం­ది కా­వా­ల­ని ఆకాం­క్షిం­చా­రు. శని­వా­రం కొం­డ­గ­ట్టు పర్య­ట­న­లో భా­గం­గా, ఇటీ­వల తె­లం­గాణ స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో జన­సేన పా­ర్టీ తర­ఫున సర్పం­చు­లు, వా­ర్డు మెం­బ­ర్లు­గా వి­జ­యం సా­ధిం­చిన అభ్య­ర్థు­లు, అలా­గే పోటీ చే­సిన అభ్య­ర్థు­ల­తో పవన్ కల్యా­ణ్ సమా­వే­శ­మ­య్యా­రు. పా­ర్టీ మద్ద­తు­తో పోటీ చేసి సు­మా­రు 50 శాతం వి­జ­యా­లు సా­ధిం­చ­డం అభి­నం­ద­నీ­య­మ­ని పే­ర్కొం­టూ, గె­లు­పొం­దిన ప్ర­తి ఒక్క­రి­కీ పేరు పే­రు­నా శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. ఈ వి­జ­యం భవి­ష్య­త్తు­లో మరింత ఉన్నత స్థా­యి­కి ఎద­గ­డా­ని­కి బల­మైన పు­నా­ది అవు­తుం­ద­ని ఆయన అన్నా­రు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున సాధించిన విజయాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. మీరు మొదలుపెట్టిన ప్రయాణం ఎంతో కీలకమైనదని, దీనిని బాధ్యతతో కొనసాగించాలని సూచించారు. తాను పార్టీ స్థాపించడానికి చైతన్యం, ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేలేనని తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటే తనకు ఎంతో అభిమానమని, ఇక్కడి ప్రజల నుంచి ఏమీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. దేశం కోసం, తెలుగు నేల కోసం జనసేన పార్టీ తరఫున చేయగలిగిన సేవను కలసికట్టుగా చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేనేనని గుర్తు చేస్తూ, ఇక్కడి ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు. తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరమని, ప్రతి ఒక్కరూ తమ స్థాయి, తమ ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయాలని సూచించారు. సైద్ధాంతిక బలంతో సహజంగా ఎదగాలని, ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన నాయకత్వాన్ని విభేదించడం కష్టమని తెలిపారు. ఆ సిద్ధాంత రాజకీయాలను తాను ఆచరణలో చేసి చూపానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పటికీ, తెలంగాణ నేల తనకు పోరాట శక్తిని ఇచ్చిందని పవన్ కల్యాణ్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో 53 మంది అభ్యర్థులు విజయం సాధించారని, దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో జనసేనకు దక్కిన ఈ విజయం ప్రత్యేకమని పేర్కొన్నారు. అందరికీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలూ క్షేమంగా ఉండాలని, తెలుగు ప్రజల ఐక్యత కోసం కలసి పనిచేద్దామని పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.

Tags:    

Similar News