విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

Update: 2021-03-30 09:12 GMT

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై 5వేల కోట్లు ఖర్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. 30వేల కోట్ల రూపాయలు ట్యాక్స్‌ రూపంలో వసూలు చేసిందని పిటిషన్‌లో తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిల్‌.. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News