East Godavari: గర్భిణీ మరణం.. వైద్యులే కారణం: ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా

East Godavari: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి..

Update: 2022-12-15 07:30 GMT

East Godavari: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్‌ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణి చనిపోయిందంటూ నిన్నట్నుంచి ఆస్పత్రి ముందు బంధువులు ధర్నా చేస్తున్నారు.. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావడంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.


నిన్న మధ్యాహ్నం ఆదిలక్ష్మి అనే మహిళ కాన్పు సమయంలో చనిపోయింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపిస్తున్నారు.. న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు.. పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు.. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మృతురాలి బంధువులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.. అయినా, వారి ఆగ్రహం చల్లారలేదు.. ఈ ఆందోళనల మధ్యే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.

Tags:    

Similar News