చిత్తూరు జిల్లా మాదిరెడ్డిపల్లెలో సురేశ్ అనే సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకున్న గ్రామస్తులపై కత్తితోదాడికి యత్నించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించాడు. అతి కష్టం సైకోను మీద అదుపులోకి తీసుకున్న పోలీసులు... చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటు...అత్యాచారం, హత్య కేసుల్లో సైకో సురేశ్ ముద్దాయిగా ఉన్నాడు.