SIT: రాజ్‌ కెసిరెడ్డికి రూ. వంద కోట్లు ఎందుకిచ్చారు

వైసీపీ ఎంపీమిథున్‌రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం... 7 గంటలపాటు విచారించిన అధికారులు... సొంత మద్యం బ్రాండ్ల తయారీ ఎందుకు అంటూ ప్రశ్నలు

Update: 2026-01-24 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో గత వై­కా­పా ప్ర­భు­త్వ హయాం­లో చోటు చే­సు­కు­న్న మద్యం కుం­భ­కో­ణం కే­సు­లో దర్యా­ప్తు వేగం పుం­జు­కుం­ది. ఈ కే­సు­లో కీలక నిం­ది­తు­డి­గా భా­వి­స్తు­న్న వై­కా­పా ఎంపీ పీవీ మి­థు­న్‌­రె­డ్డి­ని ఎన్‌­ఫో­ర్స్‌­మెం­ట్ డై­రె­క్ట­రే­ట్ (ఈడీ) అధి­కా­రు­లు దా­దా­పు ఏడు గం­ట­ల­పా­టు వి­చా­రిం­చా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని ఈడీ కా­ర్యా­ల­యం­లో శు­క్ర­వా­రం జరి­గిన ఈ వి­చా­ర­ణ­లో, మద్యం వి­ధా­నం రూ­ప­క­ల్పన నుం­చి ని­ధుల మళ్లిం­పు వరకు పలు కీలక అం­శా­ల­పై అధి­కా­రు­లు లో­తైన ప్ర­శ్న­లు సం­ధిం­చి­న­ట్లు సమా­చా­రం. ఈ కే­సు­లో ఇప్ప­టి­కే ఏపీ ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సిన ప్ర­త్యేక దర్యా­ప్తు బృం­దం (సిట్) సే­క­రిం­చిన వి­వ­రా­ల­తో పాటు, తమ స్వంత దర్యా­ప్తు­లో వె­లు­గు­లో­కి వచ్చిన ఆధా­రా­ల­ను ఈడీ అధి­కా­రు­లు మి­థు­న్‌­రె­డ్డి ఎదుట ఉంచి ప్ర­శ్నిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. అం­తే­కా­కుం­డా, ఇదే కే­సు­లో ముం­దు­రో­జు వి­చా­ర­ణ­కు హా­జ­రైన వై­కా­పా నేత వి­జ­య­సా­యి­రె­డ్డి ఇచ్చిన వాం­గ్మూ­లం­లో­ని అం­శా­ల­ను కూడా మి­థు­న్‌­రె­డ్డి­కి చూ­పిం­చి వి­వ­రణ కో­రి­న­ట్లు వి­శ్వ­స­నీయ వర్గాల సమా­చా­రం. శు­క్ర­వా­రం ఉదయం 11 గంటల సమ­యం­లో ఈడీ కా­ర్యా­ల­యా­ని­కి హా­జ­రైన మి­థు­న్‌­రె­డ్డి సా­యం­త్రం 6 గంటల వరకు అక్క­డే ఉన్నా­రు. మధ్యా­హ్న భోజన వి­రా­మం మి­న­హా, ని­రం­త­రం­గా సా­గిన ఈ వి­చా­ర­ణ­లో మద్యం వ్యా­పా­రా­ని­కి సం­బం­ధిం­చిన ఆర్థిక లా­వా­దే­వీ­లు, కం­పె­నీల మధ్య ని­ధుల బది­లీ, మద్యం వి­ధా­నం అమ­లు­లో ఆయన పా­త్ర వంటి అం­శా­ల­పై ప్ర­శ్న­లు సం­ధిం­చి­న­ట్లు తె­లి­సిం­ది.

ఈ కే­సు­లో మరింత సమా­చా­రం అవ­స­ర­మై­తే మళ్లీ వి­చా­ర­ణ­కు పి­లు­స్తా­మ­ని అధి­కా­రు­లు స్ప­ష్టం చే­య­డం­తో ఆయన సా­యం­త్రం కా­ర్యా­ల­యం నుం­చి వె­ళ్లి­పో­యా­రు. దర్యా­ప్తు­లో భా­గం­గా, అదా­న్ డి­స్టి­ల­రీ­స్ మరి­యు పీ­ఎ­ల్‌­ఆ­ర్ ఇం­డ­స్ట్రీ­స్ మధ్య పె­ద్ద మొ­త్తం­లో ని­ధుల లా­వా­దే­వీ­లు జరి­గి­న­ట్లు ఈడీ గు­ర్తిం­చిం­ది. ఈ అం­శం­పై ప్ర­శ్నిం­చ­గా, అవ­న్నీ పూ­ర్తి­గా వ్యా­పార అవ­స­రాల కో­స­మే జరి­గా­య­ని మి­థు­న్‌­రె­డ్డి వి­వ­రణ ఇచ్చి­న­ట్లు తె­లి­సిం­ది. అయి­తే, ఈ వి­వ­ర­ణ­తో అధి­కా­రు­లు పూ­ర్తి­గా సం­తృ­ప్తి చెం­ద­లే­ద­ని, మరి­న్ని వి­వ­రా­లు సే­క­రి­స్తు­న్న­ట్లు వర్గా­లు చె­బు­తు­న్నా­యి.

వి­చా­రణ జరు­గు­తు­న్న సమ­యం­లో మి­థు­న్‌­రె­డ్డి వెంట పీ­ఎ­ల్‌­ఆ­ర్ ప్రా­జె­క్ట్స్‌­కు చెం­దిన చం­ద్ర­శే­ఖ­ర్‌­రె­డ్డి, శర్వా­ణి ఇం­డ­స్ట్రీ­స్ ప్ర­తి­ని­ధు­లు కూడా ఈడీ కా­ర్యా­ల­యా­ని­కి వచ్చా­రు.ఈ వ్య­వ­హా­రం మొ­త్తం రా­జ­కీయ వర్గా­ల్లో తీ­వ్ర చర్చ­కు దారి తీ­స్తుం­డ­గా, రా­ను­న్న రో­జు­ల్లో ఈ కే­సు­లో మరి­న్ని కీలక పరి­ణా­మా­లు చోటు చే­సు­కు­నే అవ­కా­శం ఉం­ద­ని పరి­శీ­ల­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు.

Tags:    

Similar News