STAMPADE: తొక్కిసలాటకు కారణం ఇదే

ముందస్తు ఏర్పాట్లలో లోపమే కారణం

Update: 2025-11-01 14:30 GMT

కా­శీ­బు­గ్గ వెం­క­టే­శ్వర స్వా­మి ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లాట వి­షా­దం నిం­పిం­ది. దే­వా­లయ సా­మ­ర్థ్యం 2, 3 వేలు కాగా ఈరో­జు ఏకా­ద­శి కా­వ­టం­తో 25 వేలు మంది వచ్చి­న­ట్టు సమా­చా­రం. దీం­తో రె­యి­లిం­గ్ ఊడి భక్తుల మీద పడ­టం­తో గం­ద­ర­గోళ పరి­స్థి­తి నె­ల­కొం­ది. ఈ క్ర­మం­లో భక్తుల మధ్య తో­పు­లాట జరి­గిం­ది. ఆలయ అధి­కా­రు­లు ముం­ద­స్తు చర్య­లు ఏర్పా­టు చే­య­క­పో­వ­టం కూడా కా­ర­ణం­గా తె­లు­స్తోం­ది. మం­త్రి అచ్చె­న్నా­యు­డు ఘట­నా­స్థ­లా­ని­కి వె­ళ్లి బా­ధి­తు­ల­ను పరా­మ­ర్శిం­చా­రు.

శ్రీకాకుళం జల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. దుర్ఘటనలో భక్తులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సమాచారం మేరకు 10 మంది మరణించడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తొక్కిసలాటపై విచారణ

శ్రీ­కా­కు­ళం జి­ల్లా కా­శీ­బు­గ్గ వేం­క­టే­శ్వ­ర­స్వా­మి ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లాట ఘట­న­పై హోం­మం­త్రి అనిత సమ­గ్ర వి­చా­ర­ణ­కు ఆదే­శిం­చా­రు. సహాయ చర్య­ల­ను ము­మ్మ­రం చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. ఇటు, మం­త్రి అచ్చె­న్నా­యు­డు, ఎమ్మె­ల్యే గౌతు శి­రీష.. కా­శీ­బు­గ్గ వెం­క­టే­శ్వర ఆల­యా­ని­కి చే­రు­కు­న్నా­రు. బా­ధి­తు­ల­ను పరా­మ­ర్శిం­చి ధై­ర్యం చె­ప్పా­రు. బా­ధి­తు­ల­కు ప్ర­భు­త్వం అం­డ­గా ఉం­టుం­ద­ని హామీ ఇచ్చా­రు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News