Swami Srinivasananda Saraswati : విఘ్నాలు తొలగించే వినాయకుడికే విఘ్నాలు సృష్టిస్తోంది జగన్ సర్కార్ : స్వామి శ్రీనివాసానంద సరస్వతి
Swami Srinivasananda Saraswati : విఘ్నాలు తొలగించే వినాయకుడికే జగన్ సర్కార్ విఘ్నాలు సృష్టిస్తోందన్నారు శ్రీనివాసానంద సరస్వతి స్వామి.
Swami Srinivasananda Saraswati : విఘ్నాలు తొలగించే వినాయకుడికే జగన్ సర్కార్ విఘ్నాలు సృష్టిస్తోందని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు.. శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి మండిపడ్డారు. హిందువుల పై జగన్కి తీవ్ర వివక్ష ఉందన్న ఆయన.. అందుకే వినాయక చవితిని వైసీపీ సర్కార్ టార్గెట్ చేసిందన్నారు. వినాయక మండపాల వద్ద వెయ్యి రూపాయలు వసూలు చేయడంపై ఆయన మండి పడ్డారు. ఎక్కడా ఎవరికీ లేని నిబంధనలు హిందువులకే ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి 151సీట్లు ఇచ్చినందుకు హిందువులపై కక్ష సాధిస్తున్నారంటూ మండిపడ్డారు.