భోగిమంటల వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు భోగమంటల్లో పాల్గొన్నారు. రాష్ట్రప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.;
కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు భోగమంటల్లో పాల్గొన్నారు. రాష్ట్రప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఐదు రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో వేసి తగులబెట్టారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు, సున్నా వడ్డీ కుధించడం, ప్రకృతి సేద్యం నిధుల్ని వైఎస్ఆర్ పుట్టినరోజుల వేడుకలకు కేటాయించడం, కులాలవారీగా రైతుల్లో విభజన తేవడం వంటి జీవోల్ని భోగి మంటల్లో వేసి దహనం చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా.. అటు.. టీడీపీ నేతలు.. ఈ జీవోలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.