ఒక్క ఛాన్స్‌ ఇస్తే 420 వేషాలా? : పంచుమర్తి అనురాధ

Update: 2020-12-03 09:05 GMT

వైసీపీ నేతలు ఏడాది పొడవునా ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండని చెప్పి.. ఇచ్చాక 420 వేషాలు వేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు.. ఏడాది నుంచి దిశ చట్టం అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్‌ విసిరారు. దిశ చట్టం వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో ప్రభుత్వం చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. 

Tags:    

Similar News