ప్రతీకాత్మక చిత్రం
తిరుమలలోని వంటశాలలో ప్రమాదం జరిగింది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు పోటు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆశ్విని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.