TIRUMALA: తిరుమల పరకాలమణిలో రూ.100 కోట్ల చోరీ..!

పరకామణి స్కామ్‌పై సీఐడీ విచారణకు ఆదేశం.. టీటీడీ మెంబర్ భానుప్రకాశ్‌ సంచలన ఆరోపణలు.. రూ.100 కోట్ల స్కామ్ జరిగిందన్న భానుప్రకాశ్‌రెడ్డి

Update: 2025-09-21 02:30 GMT

తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం (టీ­టీ­డీ) పరి­ధి­లో­ని పర­కా­మ­ణి వి­భా­గం­లో జరి­గిన భారీ చో­రీ­పై టీ­టీ­డీ సభ్యు­డు భా­ను­ప్ర­కా­ష్‌­రె­డ్డి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఒక వీ­డి­యో­ను వి­డు­దల చే­సిన ఆయన, పర­కా­మ­ణి­లో రవి­కు­మా­ర్‌ అనే వ్య­క్తి దో­చు­కు­న్న దృ­శ్యా­లు అం­దు­లో ఉన్నా­య­ని తె­లి­పా­రు. దొం­గ­త­నా­ని­కి వై­సీ­పీ నా­య­కు­లు, అధి­కా­రుల సహ­కా­రం ఉన్న­ట్లు భా­ను­ప్ర­కా­ష్‌­రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. కో­ట్లా­ది రూ­పా­యల వి­లు­వైన డబ్బు­ను రి­య­ల్ ఎస్టే­ట్‌­లో పె­ట్టు­బ­డి చే­శా­ర­ని వి­వ­రిం­చా­రు. ఓ దొంగ నుం­చి మి­గి­లిన దొం­గ­లు అం­ద­రూ స్వా­మి­వా­రి సొ­మ్ము­ను దో­చు­కు­న్నా­రు.. గత వై­సీ­పీ ప్ర­భు­త్వ హా­యం­లో తి­రు­మల స్వా­మి­వా­రి పర­కా­మ­ణి­లో వంద కో­ట్ల దొం­గ­త­నం చే­శా­ర­ని ఆరో­పిం­చా­రు. టీ­టీ­డీ చరి­త్ర­లో అత్యంత భారీ దొం­గ­త­నం గత ప్ర­భు­త్వం­లో జరి­గిం­ది అని టీ­టీ­డీ సభ్యు­డు భా­ను­ప్ర­కా­ష్‌­రె­డ్డి అన్నా­రు. " స్వా­మి­వా­రి­కి భక్తు­లు ఎంతో భక్తి­తో కా­ను­క­లు హుం­డీ­లో వే­స్తే వా­టి­ని దో­చు­కు­న్నా­రు.. రూ. 100 కో­ట్ల పైగా పర­కా­మ­ణి­లో దొం­గ­త­నం చే­శా­రు‌..‌ ఈ కే­సు­ను హై­కో­ర్టు సీ­ఐ­డీ­కి అప్ప­గిం­చిం­ది.. వచ్చే నెల రో­జు­ల్లో సీ­ల్డ్ కవ­ర్లో వి­చా­రణ జరి­పి ని­వే­దిక ఇవ్వా­ల­ని ఆదే­శిం­చిం­ది.. దా­ని­కి సం­బం­ధిం­చిన బో­ర్డు ని­ర్ణ­యా­ల­ను ఇతర డా­క్యు­మెం­ట్ల­ను అన్ని­టి­ని సీజ్ చే­యా­ల­ని ఆదే­శిం­చిం­ది" అని భాను ప్ర­కా­ష్ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. ఒక్క­టీ­టీ­డీ­లో­నే రూ.100 కో­ట్ల వరకు దో­చు­కు­న్నా­ర­ని ఆయన ఆరో­పిం­చా­రు. అప్ప­ట్లో టీ­టీ­డీ చై­ర్మ­న్‌­గా భూమన కరు­ణా­క­ర్‌­రె­డ్డి ఉన్నా­ర­ని, ఆయన ఈ వి­ష­యం­పై స్ప­ష్టత ఇవ్వా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని అన్నా­రు.


లోక్ అదాలత్‌లో రాజీ చేస్తారా..?

అప్ప­ట్లో కే­సు­ను లోక్ అదా­ల­త్ ద్వా­రా రా­జీ­కి వె­ళ్ళా­ర­ని టీ­టీ­డీ సభ్యు­లు భాను ప్ర­కా­ష్ రె­డ్డి తె­లి­పా­రు. ఈ కే­సు­లో చాలా మంది వై­సీ­పీ ప్ర­ము­ఖుల నుం­చి ఉన్న­తా­ధి­కా­రుల వరకు అం­ద­రూ భా­గ­స్వా­మ్య­లు­గా ఉన్నా­రు, త్వ­ర­లో­నే వా­రం­ద­రి పే­ర్లు బయ­ట­కు వస్తా­య­న్నా­రు. త్వ­ర­లో ఓ అధి­కా­రి పశ్చా­త్తా­పం వ్య­క్తం చే­స్తూ ఈ రూ. 100 కో­ట్ల స్కాం­కు సం­బం­ధిం­చిన అన్ని వి­వ­రా­ల­ను బయట పె­ట్ట­బో­తు­న్నా­రు.. స్వా­మి­వా­రి సొ­త్తు­ను కీ­ల­క­మైన ఓ పో­లీ­స్ అధి­కా­రి దో­చు­కో­వ­డ­మే లక్ష్యం­గా పని చే­శా­ర­ని ఆరో­పిం­చా­రు. వై­సీ­పీ నా­య­కు­లు అం­ద­రి­కి ఇం­దు­లో వా­టా­లు వె­ళ్ళా­యి.. అప్ప­టి అధి­కా­రు­లు ఈ సొ­మ్ము­ను పం­చు­కు­న్నా­రు.. ఈ కుం­భ­కో­ణం జరి­గి­న­ప్పు­డు చై­ర్మ­న్‌­గా ఉన్న­ది భూమన కరు­ణా­క­ర్ రె­డ్డి, ఇప్పు­డు భూమన దీ­ని­కి సమా­ధాన చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. ఇక, దో­చు­కు­న్న సొ­మ్ము­లో కొంత తా­డే­ప­ల్లి ప్యా­లె­స్ కి చే­ర్చా­రని భాను ప్ర­కా­ష్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. ఎవ­రి­ని తప్పిం­చ­డా­ని­కి అప్ప­టి అధి­కా­రు­లు రా­జీ­కి వె­ళ్లా­ర­ని ఆయన ప్ర­శ్నిం­చా­రు. పో­లీ­సుల నుం­చి వచ్చిన ఒత్తి­డి కా­ర­ణం­గా.. రాజీ చే­సు­కు­న్నా­మ­ని టీ­టీ­డీ వి­జి­లె­న్స్ రి­పో­ర్టు­లో­ఉం­ద­న్నా­రు. ఒత్తి­డి తె­చ్చిన ఆ పో­లీ­సు అధి­కా­రి ఎవరో ముం­దు తే­ల్చా­ల­ని భాను ప్ర­కా­శ్ రె­డ్డి డి­మాం­డ్ చే­శా­రు. పర­కా­మ­ణి­లో పె­ద్ద­జీ­య­ర్‌ తర­ఫున సి.వి.రవి­కు­మా­ర్‌ అనే వ్య­క్తి వి­దే­శీ కరె­న్సీ­ని లె­క్కిం­చే వా­ర­ని, కొ­న్నే­ళ్లు­గా రహ­స్యం­గా దా­దా­పు­గా రూ. 200 కో­ట్ల వి­లు­వైన వి­దే­శీ కరె­న్సీ­ని బయ­ట­కు తర­లిం­చి­న­ట్లు అను­మా­నా­లు ఉన్నా­య­ని తె­లి­పా­రు.

"రూ.100 కోట్ల పరకా‘మనీ’ దొంగ వెనుక వైసీపీ"

వై­సీ­పీ గజ­దొం­గ­లు శ్రీ­వా­రి సొ­త్తూ దో­చు­కు­న్నా­రు. వం­ద­కో­ట్ల పరకా‘మనీ’ దొంగ వె­నుక ఆ పా­ర్టీ నే­త­లు ఉన్నా­ర­ని మం­త్రి నారా లో­కే­శ్‌ ధ్వ­జ­మె­త్తా­రు. ఈ మే­ర­కు వీ­డి­యో­ను ‘ఎక్స్‌’ ఖా­తా­లో పో­స్టు చే­శా­రు. అరా­చ­కం పె­చ్చ­రి­ల్లిం­ద­ని లో­కే­శ్ వె­ల్ల­డిం­చా­రు. "తా­డే­ప­ల్లి ప్యా­లె­స్ ఆశీ­స్సు­లు, నాటి తి­తి­దే ఛై­ర్మ­న్‌ భూమన కరు­ణా­క­ర్ రె­డ్డి అం­డ­దం­డ­ల­తో తి­రు­మల పర­కా­మ­ణి­లో దొం­గ­లు పడ్డా­రు. రూ.కో­ట్ల వి­లు­వైన సొ­త్తు కొ­ల్ల­గొ­ట్టా­రు. ఆ డబ్బు­లు రి­య­ల్ ఎస్టే­ట్‌­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టా­రు. తి­రు­ప­తి­లో భూమన నుం­చి తా­డే­ప­ల్లి ప్యా­లె­స్ వరకు వా­టా­లు అం­దా­య­ని నిం­ది­తు­లే చె­బు­తు­న్నా­రు." అని లో­కే­శ్ తె­లి­పా­రు.

Tags:    

Similar News