హైదరాబాద్కు బస్సులు నడపలేని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారా? : దేవినేని ఉమ
హైదరాబాద్కు బస్సులు నడపలేని వాళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారంటూ... వైసీపీ మంత్రులపై సెటైర్లు వేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. మంత్రులతో బూతులు..;
హైదరాబాద్కు బస్సులు నడపలేని వాళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారంటూ... వైసీపీ మంత్రులపై సెటైర్లు వేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. మంత్రులతో బూతులు మాట్లాడిస్తే... పోలవరం ప్రాజెక్ట్ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సబ్జెక్ట్ మాట్లాడమంటే బూతులు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ ఏడాది మే కల్లా 18 వేల ఇళ్లలోకి పోలవరం నిర్వాసితుల్ని పంపిస్తామని డ్యాంసైట్లో ప్రగల్భాలు పలికిన మంత్రి అనిల్ ఇప్పుడు ముఖం చాటేశారు. కేసుల భయంతోనే సీఎం జగన్...... పోలవరం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు దేవినేని ఉమా.