క్షుద్రపూజల కలకలం.. సృహతప్పి పడిపోయిన వ్యక్తి

Update: 2020-11-06 15:28 GMT

చిత్తూరుజిల్లాలో క్షుద్రపూజలు తీవ్రకలకలం రేపాయి. కుప్పం మండలం కృష్ణదాసనపల్లిలో క్షుద్రపూజల వ్యవహారం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. నగేష్ అనే అతను సురేష్ అనే వ్యక్తికి తీర్థం తాగించడంతో అతను సృహతప్పి పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు సురేష్ ను కాపాడారు. నగేష్ అనే అతను క్షుద్రపూజలకు పెద్దయెత్తున ఏర్పాట్లుచేయడంతో గ్రామస్తులు జంకుతున్నారు. బాధితుడు సురేష్ కుప్పం పోలీస్టేషన్‌లో పిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తునారు. నిందితుడు నగేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News