తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన అధికార పార్టీ నేతలు

సామాన్యులు చేసే తప్పులపై కఠినంగా స్పందించే విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు.. అధికారపక్ష నేతలను పల్లెత్తు మాట అనలేదన్న ఆరోపణలు..

Update: 2020-12-22 16:02 GMT

తిరుమలలో నిబంధనల ఉల్లంఘనలు ఆగడం లేదు. ఏకంగా అధికారపక్ష నాయకులే యథేచ్ఛగా రూల్స్‌ను అతిక్రమిస్తున్నారు. తిరుమలలో డ్రోన్‌ కెమెరాల వాడకం నిషేధం. ఈ విషయం అందరికీ తెలిసినా.. రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి పాదయాత్రను చిత్రీకరించేందుకు డ్రోన్‌ కెమెరాను వినియోగించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యులు తెలిసీ తెలియక చేసే తప్పులపై కఠినంగా స్పందించే.. విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు.. అధికారపక్ష నేతలను మాత్రం పల్లెత్తు మాట అనలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.


Tags:    

Similar News