గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొహం చాటేసింది. ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. కాగా 2014 కు ముందు తమ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని చెప్పి.. గత ఐదేళ్లుగా వచ్చిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఏపీకే పరిమితం అయింది వైసీపీ.