BHARAT TAXI: ఈ నెలలోనే"భారత్" ట్యాక్సీలు

ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులకు చెక్... 'భారత్' బ్రాండ్‌తో కొత్త టాక్సీ సేవలు

Update: 2026-01-12 05:00 GMT

భా­ర­త­దే­శం­లో రోజూ కో­ట్లా­ది మంది ప్ర­యాణ అవ­స­రా­ల­కు ట్యా­క్సీ సే­వ­ల­పై ఆధా­ర­ప­డు­తు­న్నా­రు. ఆఫీ­స్‌­కు వె­ళ్లా­ల­న్నా, రై­ల్వే స్టే­ష­న్ లేదా ఎయి­ర్‌­పో­ర్ట్ చే­రా­ల­న్నా, ఒక్క క్లి­క్‌­తో క్యా­బ్ బుక్ చే­సు­కు­నే సౌ­క­ర్యం ప్ర­జల జీ­వ­న­శై­లి­ని పూ­ర్తి­గా మా­ర్చే­సిం­ది. అయి­తే ఈ సౌ­క­ర్యం­తో పాటు, ఇటీ­వ­లి కా­లం­లో ప్ర­జ­ల­ను ఎక్కు­వ­గా ఇబ్బం­ది పె­డు­తు­న్న సమ­స్య ఒకటే — అధిక ఛా­ర్జీ­లు. ప్రై­వే­ట్ ట్యా­క్సీ యా­ప్‌­లైన ఉబర్ మరి­యు ఓలా వంటి సం­స్థ­లు అం­దిం­చే సే­వ­లు సౌ­క­ర్య­వం­తం­గా ఉన్న­ప్ప­టి­కీ, పీక్ అవ­ర్స్, సర్జ్ ప్రై­సిం­గ్, అద­న­పు ఫీ­జు­లు వంటి కా­ర­ణా­ల­తో ప్ర­యా­ణి­కు­లు ఎక్కువ మొ­త్తా­న్ని చె­ల్లిం­చా­ల్సి వస్తోం­ది. ఈ పరి­స్థి­తు­ల్లో ప్ర­జ­ల­కు ని­జ­మైన ఊరట కలి­గిం­చే­లా కేం­ద్ర ప్ర­భు­త్వం ఒక కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది.

దేశ రాజధాని ఢిల్లీలో భారత్‌ ట్యాక్సీ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో ఆటో, క్యాబ్‌, బైక్‌ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ భారత్‌ ట్యాక్సీ యాప్‌ ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇదివరకు ఉన్న క్యాబ్‌ ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. సుమారు 1.4 లక్షల మంది డ్రైవర్లు భారత్‌ ట్యాక్సీ యాప్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్నట్లు కేంద్రం ఇటీవలే తెలిపింది. ఈ సేవల్లో రైడ్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్‌ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు. భారత్ టాక్సీ.. ఓలా, ఉబర్ కంటే భిన్నంగా పనిచేస్తుంది. భారత్‌ ట్యాక్సీ సేవలు సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంటాయి. అదనపు ఛార్జీలు ఉండవు. సుదూర ప్రయాణాలకు కూడా ఓలా, ఉబర్‌ కంటే ఇది చాలా చౌక ధరకే అందుబాటులో ఉంటుంది. ఓలా, ఉబర్‌ సేవలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

సా­మా­న్య ప్ర­జల ప్ర­యాణ ఖర్చు­ను తగ్గిం­చ­డ­మే లక్ష్యం­గా కేం­ద్ర ప్ర­భు­త్వం తా­జా­గా భా­ర­త్ ట్యా­క్సీ అనే కొ­త్త ప్ర­భు­త్వ ట్యా­క్సీ సే­వ­ల­ను అం­దు­బా­టు­లో­కి తీ­సు­కు­వ­చ్చిం­ది. ఇప్ప­టి­కే మా­ర్కె­ట్లో ఉన్న ప్రై­వే­ట్ యా­ప్‌­ల­కు ప్ర­త్యా­మ్నా­యం­గా కా­కుం­డా, వా­టి­కం­టే మె­రు­గైన, పా­ర­ద­ర్శ­క­మైన, తక్కువ ధరల సే­వ­ల­ను అం­దిం­చ­డ­మే ఈ భా­ర­త్ ట్యా­క్సీ ప్ర­ధాన ఉద్దే­శం. ప్ర­జ­లు ఎదు­ర్కొం­టు­న్న సమ­స్య­ల­ను అధ్య­య­నం చే­సిన తర్వా­తే ప్ర­భు­త్వం ఈ సే­వ­ల­ను ప్రా­రం­భిం­చి­న­ట్టు అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. ము­ఖ్యం­గా అధిక ఛా­ర్జీ­లు, డ్రై­వ­ర్ల కమి­ష­న్ భారం, ప్ర­యా­ణి­కు­లు–డ్రై­వ­ర్ల మధ్య తలె­త్తే వి­వా­దా­ల­ను తగ్గిం­చ­డ­మే లక్ష్యం­గా ఈ వి­ధా­నా­న్ని రూ­పొం­దిం­చా­రు.

కమీషన్ లేదు

భా­ర­త్ ట్యా­క్సీ ప్ర­త్యే­క­త­ల­లో ఇది అత్యంత ము­ఖ్య­మైన అంశం. ఓలా, ఉబర్ వంటి ప్రై­వే­ట్ యా­ప్‌­ల­లో డ్రై­వ­ర్లు ఆయా కం­పె­నీ­ల­కు భారీ కమి­ష­న్ చె­ల్లిం­చా­ల్సి ఉం­టుం­ది. కొ­న్ని సం­ద­ర్భా­ల్లో ఈ కమి­ష­న్ 20–30 శాతం వరకు ఉం­టుం­ది. ఈ భా­రా­న్ని డ్రై­వ­ర్లు ప్ర­యా­ణి­కు­ల­పై అద­న­పు ఛా­ర్జీల రూ­పం­లో మో­పు­తు­న్నా­రు. కానీ భా­ర­త్ ట్యా­క్సీ­లో ఈ సమ­స్యే లేదు.ఈ ప్ర­భు­త్వ ట్యా­క్సీ సే­వ­ల్లో డ్రై­వ­ర్లు ప్ర­భు­త్వా­ని­కి ఎలాం­టి కమి­ష­న్ చె­ల్లిం­చా­ల్సిన అవ­స­రం ఉం­డ­దు. ప్ర­యా­ణి­కు­లు చె­ల్లిం­చిన మొ­త్తం డబ్బు నే­రు­గా డ్రై­వ­ర్ల­కే చే­రు­తుం­ది. దీని వల్ల డ్రై­వ­ర్ల­కు పూ­ర్తి ఆదా­యం లభి­స్తుం­ది, ప్ర­యా­ణి­కు­ల­కు తక్కువ ఖర్చు­తో ప్ర­యా­ణిం­చే అవ­కా­శం దక్కు­తుం­ది.

Tags:    

Similar News