GOLD CARD: అమెరికాలో పౌరసత్వం కోసం "గోల్డ్ కార్డ్"

గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించిన ట్రంప్... ఈబీ-5 ప్లేస్లో గోల్డ్‌ కార్డు తీసుకొచ్చిన అమెరికా;

Update: 2025-06-13 04:30 GMT

అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్ కార్డు ఆఫర్ ను అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 ప్లేస్ లో గోల్డ్‌ కార్డు తీసుకు వస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. 5 మిలియన్‌ డాలర్లు ‌(రూ.44 కోట్లు) చెల్లించిన వారికి నేరుగా యూఎస్ పౌరసత్వాన్ని అందజేయనున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ గోల్డ్‌ కార్డుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించారు. 5 మిలియన్ డాలర్లకు, ట్రంప్ కార్డ్ రానుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. యూఎస్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు అనేక మంది కాల్ చేసి.. ఎలా నమోదు చేసుకోవాలని అడుగుతున్నారు.. అయితే, ఈ గోల్డ్‌ కార్డ్‌ ఇంకా కొనుగోలుకు అందుబాటులోకి రాలేదని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ప్రస్తుతం వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవడానికి మాత్రమే అందుబాటులో ఉంది.. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ కార్డు లేదా గోల్డ్ కార్డు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారు అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారి పేరు, ప్రాంతం, ఈ-మెయిల్ సహా ఇతర వివరాలను రిజిస్ట్రర్ చేయాల్సి ఉంటుంది. పొందే మార్గం సులువు అవుతుంద‌ని తెలుస్తోంది. సుమారు 10 ల‌క్ష‌ల గోల్డ్ కార్డుల‌ను మంజూరీ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబ‌డి పెట్టే విదేశీయుల‌కు గ్రీన్ కార్డు ఇస్తారు. గోల్డ్ కార్డుల‌ను అమ్మ‌నున్నామ‌ని, ఆ కార్డుకు ధ‌ర‌ను నిర్ణ‌యిస్తామ‌ని, 5 మిలియ‌న్ల డాల‌ర్ల‌కే ఆ కార్డును ఇవ్వ‌నున్న‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు.

భారత్‌లో అద్భుత విజయం సాధిస్తుంది: లుట్నిక్‌

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ట్రంప్‌ ప్రవేశపెట్టిన గోల్డ్‌ కార్డ్‌ భారత్‌లోనూ మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో విడుదల చేసిన వెంటనే భారత్‌లోకి తీసుకొస్తామని చెప్పారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నాయకత్వ సదస్సు 2025లో కీలక ప్రసంగం చేసిన లుట్నిక్‌.. అధునాతన తయారీ రంగాన్ని తిరిగి అమెరికాలోకి తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు. గ్రీన్‌ కార్డుతరహాలో రానున్న 5 మిలియన్‌ డాలర్ల విలువైన గోల్డ్‌కార్డ్‌ గురించి లుట్నిక్‌ ప్రస్తావిస్తూ.. భారత్‌లో అద్భుత విజయం సాధించనుందని చెప్పారు. ఎప్పుడు వస్తుందని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ట్రంప్‌ కార్డ్‌ విడుదల చేయగానే భారత్‌కు కూడా వస్తుందని హామీ ఇచ్చారు. రెండు ఆర్థిక వ్యవస్థల్లో భాగస్వామ్యమయ్యేందుకు ఇదో అద్భుత అవకాశమని, విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించడంతోపాటు ఇక్కడే పనిచేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ‘‘అమెరికా వలసవాద క్రమం మారుతోంది. ట్రంప్‌ గోల్డ్‌ కార్డు బయటకు వస్తోంది. అమెరికాకు వచ్చే సామర్థ్యమున్న వారికి ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నా. గ్రీన్‌కార్డు హోల్డర్‌ మాదిరిగా మారవచ్చని ట్నిక్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News