సినిమాల్లో కొన్ని కులాలను టార్గెట్ చేస్తున్నారు అనే వాదన చాలాకాలంగా ఉంది. అందులో ప్రధానంగా బ్రాహ్మిన్స్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా కొన్ని సినిమాలకు సంబంధించి సెన్సార్ లో అభ్యంతరాలు రావడం.. తీసేయడం.. మరికొన్ని సందర్భాల్లో హాస్యంగానే ఉంచేయడం చూశాం. చూస్తున్నాం. అయితే కేవలం మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనేది వారి వాదన. తాజాగా గత శుక్రవారం విడుదలైన ‘8 వసంతాలు’అనే సినిమాలో ప్రధాన పాత్ర ధారి అయిన శుద్ధి అయోధ్య (అనంతిక సనిల్ కుమార్) కాశీ వెళుతుంది. అడ్రెస్ కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఒక బ్రాహ్మణ వ్యక్తి ఆమెకు అడ్రెస్ చెబుతా అని.. తీసుకువెళతాడు. చాలా దూరం నడిపించిన తర్వాత అతను ఓ కబేళాకు వెళతాడు. అక్కడే ఆమెపై అఘాయిత్యం చేయబోతాడు. ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పర్ట్ అయిన ఆ అమ్మాయి.. తనపై జరగబోయే అఘాయిత్యం నుంచి తప్పించుకుంటుంది. ఈ క్రమంలో అతనికి సాయడం చేయడానికి వచ్చిన ‘కబేళా నిర్వాహకులందరినీ’ చంపేస్తుంది. తనపై లైంగిక దాడి చేయబోయిన వ్యక్తిని మాత్రం వదిలేస్తుంది. ఇదీ సీన్.
సో.. రీసెంట్ గా జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్ లోఓ సీనియర్ జర్నలిస్ట్ అలా బ్రాహ్మణులను రేపిస్టులుగా చూపించడం పట్ల తను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అంటూ తీవ్ర ఆగ్రహాన్ని చూపించాడు. పైగా కబేళా వరకూ తీసుకువెళతారా అంటూ కోపంతో ఊగిపోయాడు. టీమ్ అంతా కొత్తవాళ్లు. పైగా అక్కడ దర్శక రచయిత అయిన ఫణింద్ర నరిశెట్టి లేడు. దీంతో అతనికి సరైన సమాధానం రాలేదు. అయినా ‘మా కమ్యూనిటీ’ని రేపిస్టులుగా చిత్రీకరించారు అనే ఆవేదన సదరు జర్నలిస్ట్ లో కనిపించింది. అయితే బ్రాహ్మణులందరూ సచ్ఛీలురే అనేది ఆయన అభిప్రాయం అయి ఉండాలి. అదే టైమ్ లో కబేళా విషయానికి వస్తే.. నార్త్ లో చాలామంది బ్రాహ్మిణ్స్ నాన్ వెజ్(బీఫ్ కాకపోవచ్చు) తింటారు. అలాగే అనేక బీఫ్ ఎక్స్ పోర్ట్ కంపెనీస్ అన్నీ బ్రాహ్మణులు నడిపేవే అని నిత్యం వార్తల్లో చూస్తున్నాం. ఇవన్నీ పక్కన పెబితే సదరు జర్నలిస్ట్ అభిప్రాయానికి కౌంటర్ గా దర్శకుడు ఓ పోస్ట్ పెట్టాడు.
‘నాకు ఆ వర్గం అంటే గౌరవం ఉంది. వారిని సరస్వతి పుత్రులుగా చూస్తాం. కానీ ఆ జర్నలిస్ట్ కమ్యూనిటికీ రేప్ కు లింక్ పెట్టడం నాకు అర్థం కాలేదు. నేరం అనేది వ్యక్తి మైండ్ సెట్ (మనః ప్రవృత్తి) నేచర్ ( స్వభావం) ను బట్టి ఉంటుంది కానీ.. కులాన్ని, మతాన్ని బట్టి ఉండదు. అదే నిజమైతే రావణుడు ఎవరు.? ఎందుకు వేరే వ్యక్తి భార్యను ఎత్తుకు పోయాడు.. ’అంటూ తన సన్నివేశాన్ని సమర్థించుకుంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి దీనికి సదరు జర్నలిస్ట్ రిప్లై ఇస్తాడా లేదా అనేది చూడాలి.