ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ "డ్రైవ్". ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. "డ్రైవ్" సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
"డ్రైవ్" సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే - తన తండ్రి స్థాపించిన ప్రజా మీడియా కార్పొరేషన్ వారసుడిగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తుంటాడు హీరో ఆది పినిశెట్టి. సౌత్ ఇండియాలో పేరున్న ఈ సంస్థ అక్కౌంట్స్ ను ఒక హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. ఈ హ్యాక్ తో ప్రజా మీడియా కార్పొరేషన్ గౌరవం, క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంలో పడతాయి. ఈ హ్యాకర్ ఎవరు ?, ప్రజా మీడియా కార్పొరేషన్ తో పాటు హీరో పర్సనల్ లైఫ్ ను ఎందుకు టార్గెట్ చేశాడు ?. ఆ హ్యాకర్ ను హీరో పట్టుకోగలిగాడా ? లేదా ? అనేది టీజర్ లో ఆసక్తి కలిగిస్తోంది.