Aamir Khan : లోకేష్ వర్స్ లోకి ఆమిర్ ఖాన్

Update: 2025-06-05 12:21 GMT

బాలీవుడ్ ఖాన్ త్రయం అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమా ముఖచిత్రాలు అని చెప్పుకున్నారు. కానీ ఆ త్రయం మ్యాజిక్ ఆగిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు, సౌత్ సినిమానే. వారి రొటీన్ మూవీస్ కు అక్కడి ప్రేక్షకులే చరమగీతం పాడేశారు. ప్రస్తుతం నార్త్ లో కూడా సౌత్ సినిమాలదే హవా. దీంతో వాళ్లు కూడా మన సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కొన్నాళ్ల క్రితం షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో జవాన్ అనే మూవీ చేసి వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. సల్మాన్ ఖాన్ ఆ రేంజ్ కలెక్షన్స్ సాధించలేదు కానీ..ప్రభుదేవాతో కొన్ని రీమేక్స్ చేసి విజయాలు సాధించాడు. రీసెంట్ గా మురుగదాస్ తో చేసిన సికిందర్ ఫ్లాప్ అయింది. అటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేసిన సన్నీడియోల్ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ రూట్ లోకి ఆమిర్ ఖాన్ కూడా వస్తున్నాడు. నిజానికి ఆమిర్ గతంలోనే మురుగదాస్ తో గజిని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. బట్ ఇప్పుడు సినారియో వేరు కదా. అందుకే ఇది స్పెషల్ అయింది. అతనే కాదు.. దర్శకుడు అసలు స్పెషల్ ఇక్కడ.

ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ మూవీ చేసి ఉన్నాడు. నెక్ట్స్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న కూలీ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేశాడు. నెక్ట్స్ లాహోర్ 1947 అనే సినిమా చేయబోతున్నాడు. అయితే కూలీ టైమ్ లో లోకేష్ కు ఆమిర్ కు మంచి బాండింగ్ సెట్ అయింది. ఆ కారణంగా లోకేష్ కనగరాజ్ చెప్పిన ఓ కథకు ఆమిర్ ఫిదా అయ్యాడట. ఇదో సూపర్ హీరో కథ అంటున్నారు. అన్నీ సెట్ అయిపోయాయి. ఈ మూవీని 2026 చివర్లో ప్రారంభించి 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ లోగా లోకేష్ చాలా గ్యాప్ వచ్చిన కార్తీ ఖైదీ 2 చేస్తాడు. ఆ తర్వాత ఆమిర్ తో మూవీ పట్టాలెక్కుతుందట. కాస్త ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ మూవీతో ఈజీగా వీళ్లు 2000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తారు అని ఇప్పుడే చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News