Gemini Suresh : మీడియా నుంచి తొలి హీరోగా జెమినీ సురేష్ "ఆత్మ కథ" ప్రారంభం

Update: 2025-08-22 10:41 GMT

వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ పై శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందబోతోన్న సినిమా ‘ఆత్మకథ’.సోమేశ్వరరావు నిర్మాత. జెమిని సురేష్, అఖిల నాయర్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అలాగే జెమిని కిరణ్ గారి చేతుల మీదగా అందుకోగా తొలిగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమిని సురేష్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి గారు ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెమిని సురేష్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను మీ జెమిని సురేష్. ఇది హీరోగా నా తొలి చిత్రం. నా 18 సంవత్సరాల కల నేడు నెరవేరబోతుంది. ఒక మంచి కథతో ప్రేక్షకులు ముందుకు రావాలి అని అనుకున్నాను. శ్రీనివాస్ గారు ఆత్మకథ చిత్రంతో అవకాశం ఇచ్చారు. నా ఈ చిత్ర పూజ కార్యక్రమానికి నాకు దేవుడు లాంటి వ్యక్తి జెమిని కిరణ్ గారు వచ్చి ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రసన్న కుమార్ గారు పాల్గొనడం సంతోషకరం. అలాగే దండు శ్రీనివాస్ రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా తొలి చిత్రానికి మా అమ్మ చేతిల మీదగా క్లాప్ కొట్టడం అనేది మరింత సంతోషకరం. అలాగే సమ్మెట గాంధీ గారికి, ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా నుండి వచ్చిన తొలి హీరో నేనే కాబట్టి మీడియా వారు ఉంటే నాకు కచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రేక్షకులు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నటి అఖిల మాట్లాడుతూ... "మా చిత్ర బృందానికి అందరికీ ఆల్ ద బెస్ట్ చేప్పుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, జెమిని సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

సీనియర్ నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ... "ఆత్మకథ అనే చిత్రంలో నటించే అవకాశం నాకు జెమిని సురేష్ ద్వారా వచ్చింది. దానికి గాను జెమినీ సురేష్ కి ధన్యవాదాలు. ఈ చిత్ర దర్శకులు శ్రీనివాస్ గారికి, నిర్మాతలకు అలాగే ఇతర నటీనటులకు, సాంకేతిక బృందం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో కీలకం. ఇటీవల కాలంలో ఇటువంటి చిత్రం రాలేదు. " అన్నారు.

దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. నేను ఇప్పటికే ఒక హిందీ సినిమాకు, నాలుగు కన్నడ చిత్రాలకి అలాగే ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించాను. కథని హీరోగా అనుకుని ఆత్మకథ అనే చిత్రాన్ని రచించాను. ఈ చిత్రంలో జెమిని సురేష్ గారు, సమ్మెట గాంధీ గారు రెండు స్తంభాలు వంటి వారు. నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే శ్రేయాస్ ను అతి చిన్న వయసులోనే సంగీత దర్శకునిగా తీసుకోవడానికి కారణం అతని టాలెంట్. ఈ చిత్రాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

సంగీత దర్శకులు శ్రేయాస్ మాట్లాడుతూ... "నా పేరు శ్రేయాస్. గ్రేడ్ 6 చదువుతున్నాను. నేను ఇప్పటికే ఐదు ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తున్నాను. ఎన్నో సంగీత కోర్సులు కూడా నేర్చుకున్నాను. చిత్ర బృందం అందరికీ థాంక్స్" అన్నారు.

Tags:    

Similar News