Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ సెట్లో ఆరాధ్యకు మణిరత్నం స్పెషల్ ట్రీట్: ఐశ్వర్య రాయ్ బచ్చన్
Ponniyin Selvan: తాను నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో తన కూతురు కూడా పాలుపంచుకుందని చెప్పింది ఐశ్వర్య.;
Ponniyin Selvan: తాను నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో తన కూతురు కూడా పాలుపంచుకుందని చెప్పింది ఐశ్వర్య. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ సన్నివేశంలో 'యాక్షన్' చెప్పడానికి దర్శకుడు మణిరత్నం ఆరాధ్యకు అనుమతిచ్చారు అని వెల్లడించింది.
ఆరాధ్య సెట్కి వచ్చినప్పుడు మణిరత్నం ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారని చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఐశ్వర్య. సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల కానున్న పొన్నియిన్ సెల్వన్ ఐ ప్రమోషన్స్లో ఐశ్వర్యరాయ్ బిజీగా ఉన్నారు.
12 సంవత్సరాల తర్వాత దర్శకుడు మణిరత్నంతో ఐశ్వర్యరాయ్ మళ్లీ కలిసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ I.. 2010లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం రావణన్. పొన్నియిన్ సెల్వన్ Iలో, పజువూరు రాణి నందిని పాత్రలో ఐశ్వర్య నటించింది. ఆమె తన తండ్రి, నటుడు అభిషేక్ బచ్చన్తో కలిసి సినిమా సెట్ను సందర్శించినప్పుడు ఆమె రాణిగా నటించడంపై కుమార్తె ఆరాధ్య స్పందన గురించి మాట్లాడింది.
ఆరాధ్య నా నటన, నా వేషధారణ పట్ల ఆకర్షితురాలైంది. ఒక పీరియాడికల్ డ్రామా చూడటం ఎప్పుడూ ఎగ్జైటింగ్గా ఉంటుంది. సెట్ను సందర్శించే అవకాశం ఆరాధ్యకు లభించింది. మణిరత్నంతో పనిచేసే అవకాశాం లభించడం నా అదృష్ణం. ఆయన చాలా గొప్పవ్యక్తి. సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆరాధ్యకు యాక్షన్ చెప్పే అవకాశం రావడం ఆమెకు అత్యంత ప్రియమైన జ్ఞాపకం అని ఐశ్వర్య వివరించింది. Aaradhya's