Tamil Nadu : పేదలకు అండగా తమిళ సినీ ప్రముఖులు.. !
Tamil Nadu : కరోనా విపత్కర పరిస్థితులలో పేదలను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
Tamil Nadu : కరోనా విపత్కర పరిస్థితులలో పేదలను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సూర్య, కార్తీ.. సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించగా, దర్శకుడు మురుగ దాస్ రూ.25 లక్షలను సీఎం స్టాలినకు అందించారు. తాజాగా అజిత్ కూడా రూ.25 లక్షలు సీఎం సహాయనిధికి ఆన్లైన్ ద్వారా పంపారు. గతేడాది కూడా కరోనా సమయంలో అజిత్ విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అటు కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.