Asha Bhosle: మూగబోయిన గంధర్వగానం- ఆశా భోంస్లే ఇకలేరు

ఆశా భోంస్లే మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల సంతాపం

Update: 2026-04-12 08:10 GMT

ప్ర­ముఖ గా­య­ని ఆశా భోం­స్లే (92) ఇక­లే­రు. ముం­బ­యి­లో­ని బ్రీ­చ్‌ క్యాం­డీ ఆస్ప­త్రి­లో చి­కి­త్స పొం­దు­తూ ఆది­వా­రం తు­ది­శ్వాస వి­డి­చా­రు. ఆమె కు­మా­రు­డు ఆనం­ద్‌ బోం­స్లే ఈ వి­ష­యా­న్ని ధ్రు­వీ­క­రిం­చా­రు. తన తల్లి అం­త్య­క్రి­య­లు సో­మ­వా­రం సా­యం­త్రం ముం­బ­యి­లో­ని శి­వా­జీ పా­ర్క్‌­లో ని­ర్వ­హి­స్తా­మ­ని తె­లి­పా­రు. ఛా­తీ­లో ఇన్ఫె­క్ష­న్‌ సో­క­డం­తో ఊపి­రి తీ­సు­కో­వ­డం­లో ఇబ్బం­ది ఏర్ప­డ­గా ఆశా భోం­స్లే­ను కు­టుంబ సభ్యు­లు శని­వా­రం రా­త్రి ఆస్ప­త్రి­లో చే­ర్చిన సం­గ­తి తె­లి­సిం­దే. ఆశా భోం­స్లే మృతి పట్ల సినీ, రా­జ­కీయ, క్రీ­డా ప్ర­ము­ఖు­లు సో­ష­ల్‌ మీ­డి­యా­లో సం­తా­పం ప్ర­క­టి­స్తు­న్నా­రు. 1933లో ఆశా భోం­స్లే జన్మిం­చా­రు. గా­య­ని­గా సు­దీ­ర్ఘ ప్ర­యా­ణం ఆమె­ది. ఎన్నో వేల పా­ట­ల­తో శ్రో­త­ల­ను అల­రిం­చా­రు. చి­త్ర పరి­శ్ర­మ­కు చే­సిన ఎన­లే­ని కృ­షి­కి­గా­నూ పద్మ వి­భూ­ష­ణ్‌, దా­దా­సా­హె­బ్‌ ఫా­ల్కే, మహా­రా­ష్ట్ర భూ­ష­ణ్‌, బంగా బి­భూ­ష­న్‌ అవా­ర్డు­లు ఆమె­ను వరిం­చా­యి.

లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే, ప్రారంభంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమించారు. 1943లో ‘మాఝా బాళ్‌’ అనే మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, 1950వ దశకంలో బాలీవుడ్ వైపు మళ్లింది. 1952లో వచ్చిన ‘సంగ్దిల్’ సినిమాతో ఆమె గొంతు దేశవ్యాప్తంగా వినబడటం మొదలైంది. ‘పరిణీత’, ‘బూట్ పాలిష్’ వంటి చిత్రాలు ఆమెను అగ్ర దర్శకుల దృష్టిలో పడేలా చేశాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్‌తో ఆమె చేసిన ప్రయోగాలు ఒక ట్రెండ్‌ను సెట్ చేశాయి.

కేవలం మెలోడీలే కాకుండా, క్యాబరే సాంగ్స్, క్లబ్ డ్యాన్స్ నంబర్లను సైతం అంత హుందాగా పాడటం ఆమెకే సాధ్యమైంది. మొహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా” వంటి పాటలు నేటికీ ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచిపోయాయి. ఇక ఆశా భోస్లేకి తెలుగు భాషతో విడదీయలేని అనుబంధం ఉంది. ‘మాయాబజార్’ వంటి క్లాసిక్ సినిమాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల వరకు ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. “వస్తాడు నా రాజు..” వంటి మధుర గీతాలు నేటికీ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News