Guntur Kaaram : క్రిస్మస్ సందర్భంగా మహేష్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
కొత్త పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భారీ బడ్జెట్ డ్రామా 'గుంటూరు కారం' కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇది టాలీవుడ్లో చాలా హైప్ చేయబడిన ప్రాజెక్ట్. తాజాగా క్రిస్మస్ కానుకగా 'గుంటూరు కారం' టీమ్ సోమవారం అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. గుంటూరు కారం నిర్మాతలు మహేష్ బాబు ఉన్న కొత్త పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ విషయానికొస్తే, ఇప్పటివరకు విడుదలైన ప్రతి పోస్టర్లో మాస్ లుక్లో కనిపించిన మహేష్ బాబు ఈసారి క్లాస్ లుక్లో కనిపించాడు.
బ్లాక్ షర్ట్లో కొత్త హెయిర్ స్టైల్తో కొత్త లుక్తో మహేష్ బాబు తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 'గుంటూరు కారం' క్రిస్మస్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మదర్ సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అంశాల మేళవింపుతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'గుంటూరు కారం' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు 'గుంటూరు కారం' మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో 'గుంటూరు కారం'పైనే అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే 'గుంటూరు కారం' ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. ఇక 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు రాజమౌళితో మహేష్ బాబు ఓ అడ్వెంచర్ మూవీ చేయనున్నాడు. 'గుంటూరు కారం' తర్వాత మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచర్ మూవీ చేయనున్నాడు.
Wishing you all a Merry Christmas filled with joy and warmth! 🎅🎄❄️ - Team #GunturKaaram 💥
— Haarika & Hassine Creations (@haarikahassine) December 25, 2023
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th 🌶 pic.twitter.com/5U8DAIHGzG