ఎన్టీఆర్ లంబోర్ఘిని ఊరుస్ కారు.. దేశంలో తొలి వ్యక్తిగా రికార్డు..
Jr NTR: సినీ సెలబ్రెటీలు ఖరీదైన కార్లు, వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.;
Jr NTR: సినీ సెలబ్రెటీలు ఖరీదైన కార్లు, వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అనేక మంది తమ ఇంట్లో లగ్జరీ కారులు కొలుగోలు చేశారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అత్యంత ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. దేశంలో లాంచ్ చేసిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్ బుక్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ లంబోర్ఘీన ఊరుస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్ బుధవారం తారక్ ఇంటికి చేరుకుంది. ముందుగా ఇటలీ నుంచి శంషాబాద్ ఎయిరపోర్టుకు ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి చేరుకుంది.
ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్ . 3,16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ తగ్గించినా ఎలాంటి ఒడిదుడుకులు లోను కాదట. ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్లు కానీ అంత ఈజీ తెరచుకు ఇదే దీని ప్రత్యేకత.
ఫుల్లీ ఆటోమెటెడ్, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు.అయితే ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్ 20పైగా కార్లు ఉన్నాయట. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థయే 'లంబోర్ఘిని'. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్ అయ్యింది.