Kangana Ranaut: 'కాశ్మీర్ ఫైల్స్' చూడండి.. బాలీవుడ్ పాపాలన్నీ కడిగేశాడు.. : కంగన కామెంట్స్

Kangana Ranaut: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ది కాశ్మీర్ ఫైల్స్' తొంభైలలో కాశ్మీరీ హిందువులపై జరిగిన ఊచకోతను తెరకెక్కించింది.;

Update: 2022-03-16 08:00 GMT

Kangana Ranaut: ఇప్పుడు ఎక్కడ చూసినా 'ది కాశ్మీర్ ఫైల్స్' ముచ్చటే.. ఈ చిత్రం ఓ సంచలనం సృష్టిస్తోంది.. 1990ల్లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి వివరించే ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోంది.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రధాని మోదీ సైతం ఇలాంటి చిత్రాలు మరిన్ని రావలసి ఉంది అని అన్నారు. ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేసిన దర్శకుడి కృషి అభినందనీయం అని కాశ్మీర్ ఫైల్స్ టీమ్ ని మెచ్చుకున్నారు మోదీ.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ది కాశ్మీర్ ఫైల్స్' తొంభైలలో కాశ్మీరీ హిందువులపై జరిగిన ఊచకోతను తెరకెక్కించింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా నిరంతరం స్పందన వస్తోంది. ఈ సినిమా చూసి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంది.

ఈ సినిమా ద్వారా వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ పాపాలన్నింటినీ కడిగిపారేసినట్లు చెప్పాడు. అలాగే ఒకప్పుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో నివసించిన కోట్లాది మంది హిందువుల గురించి కూడా ప్రస్తావించింది. ఈ చిత్రాన్ని చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది.

"నేను నాతో కలిసి కాశ్మీర్ ఫైల్స్ చూశాను" అని చిత్రం గురించి వివరించింది. వివేక్ అగ్నిహోత్రి జీ మీకు, మీ బృందానికి అభినందనలు. మీరు ఈ సినిమా ద్వారా యావత్ దేశం, సినీ పరిశ్రమ గర్వపడేలా చేశారు. ఈ చిత్ర పరిశ్రమ మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది. దశాబ్దాలుగా చేసిన మా పాపాలను కూడా మీరు కడిగేసారు. నాకు మార్గనిర్దేశం చేసినందుకు మీకు అందరి తరపున ధన్యవాదాలు."

కంగనా ఇంకా మాట్లాడుతూ, "కాశ్మీర్‌లో జరిగిన ఈ సంఘటన.. ఒకే ఒక్క సంఘటనతో జరిగిందని అనుకోవడం చాలా పెద్ద తప్పు. భారతదేశం విభజించబడినప్పుడు, చాలా మంది హిందువులు ఉన్నారు. పాకిస్థాన్‌లో ముస్లింలు ఉన్నట్లే.. ఈరోజు ఇక్కడ ముస్లింల జనాభాను చూస్తే పాకిస్థాన్‌లో ఒక్క హిందువు కూడా మిగలడం లేదు. రోజూ చంపేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు.. రోజూ నరికి పారేస్తున్నారు.. బంగ్లాదేశ్ నుంచి కోట్లాది మంది ఎక్కడికి వెళ్లారు.. ఎప్పుడైనా ఆలోచించారా?

కంగనా తన అభిప్రాయాన్ని కొనసాగిస్తూ, "ఇది ప్రభుత్వ పోరాటం కాదు, నాగరికత పోరాటం, ఇది ప్రతి భారతీయుడి పోరాటం, మీ ఉపాధ్యాయులు మీకు చెప్పని ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తప్పక 'ది కాశ్మీర్ ఫైల్స్' చూడండి. కొత్త భారతదేశానికి పునాది వేయండి." అని ఆమె వీడియోలో వివరించింది.

Tags:    

Similar News