Karan Johar : కంగనా 'ఎమర్జెన్సీ' చూసేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నాను : కరణ్ జోహార్
కంగనా మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ - కంగనా రనౌత్ల ల మధ్య జరుగుతున్న ఫైట్ భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే వారు ఎప్పుడైనా తమ యుద్ధాన్ని ముగించవచ్చు. వారు చెప్పినట్లు, ఏదీ శాశ్వతం కాదు. ఇటీవల, కరణ్.. కంగనా రాబోయే మూవీ విడుదల గురించి మాట్లాడాడు. పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీని చూడటానికి తాను ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నాడు.
'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇటీవల తాను పొలిటికల్ డ్రామా ఫిల్మ్ తీస్తున్నట్లు చెప్పాడు. "ఎమర్జెన్సీ రాబోతోంది. నేను దాన్ని చూడటానికి సంతోషిస్తున్నాను" అని చెప్పాడు. ప్రస్తుతం కంగనా 'ఎమర్జెన్సీ'లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ చాలా మందిని ఆకట్టుకున్నాయి.
కరణ్ జోహార్.. కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ 'ది ఎమర్జెన్సీ' గురించి కరణ్ సానుకూలంగా స్పందించడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా స్టార్ హీరోయిన్ అలియా భట్, రణవీర్ సింగ్ జంటగా నటించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' ఇటీవలే విజయం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ మూవీపైనా కంగనా ఇటీవల వ్యాఖ్యలు సంధించింది. “ప్రేక్షకులను ఇక మోసం చేయలేము. ఫేక్ సెట్లు, టాప్ ఫేక్ కాస్ట్యూమ్లతో నిండిన దారుణమైన, పేలవమైన చిత్రాలు. తొంభైల నాటి సినిమాలను కాపీ కొట్టినందుకు కరణ్ జోహార్ సిగ్గుపడాలి... ఈ మూర్ఖత్వానికి అతను 250 కోట్లు ఎలా ఖర్చు చేశాడు? నిజమైన ప్రతిభ నిధుల కోసం కష్టపడుతున్నప్పుడు వారికి ఈ రకమైన డబ్బు ఎవరు ఇస్తారు” ఆని కంగనా అన్నారు.
Karan Johar revealed that he’s excited to watch Kangana Ranaut’s directorial #Emergency#KanganaRanaut #KaranJohar pic.twitter.com/iyVkf4f4Kh
— Kangana Ranaut Daily (@KanganaDaily) August 21, 2023