హిందీ చిత్రం 'పింటు కీ పప్పీ' తెలుగులో 'కిస్ కిస్ కిస్సిక్' పేరుతో రిలీజ్ కానుంది. సుశాంత్, జాన్యాజోషి జంటగా నటించిన ఈ చిత్రానికి శివ్ హరే దర్శకత్వం వహించారు. విధి ఆచార్య నిర్మాతగా వ్యవహరిం చారు. ఈ నెల 21న హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయనుంది. ఈ మేరకు ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని, పింటు అనే యువకుడి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సంఘటనలను హాస్యమే ప్రధానంగా ఆవిష్కరిస్తూ ఈ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య. హీరో ముద్దు పెట్టిన అమ్మాయిలందరికీ వేరే అబ్బాయిలతో పెళ్లవుతుంది. దీంతో అతడు ఏం చేశాడు? తాను ఎంతగానో ఇష్ట పడిన అమ్మాయిని అతడు ముద్దు పెట్టుకున్నాడా? వంటి అంశాలతో ఈ సినిమా సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.