MS Dhoni: ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ..
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథసారథి మహేంద్ర సింగ్ ధోని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశారు.;
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథసారథి మహేంద్ర సింగ్ ధోని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇదివరకే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించిన ఆయన తాజాగా ఓ కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించారు. దీపావళి సందర్భంగా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు.
ధోని ప్రారంభించిన ఫిలిం ప్రొడక్షన్ హౌస్కు ధోని భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ధోని రాసిన అథర్వ-ది హరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా తొలి సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మూవీని రమేష్ తమిళమణి డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని రమేష్ తమిళమణి చెప్పారు. ఇందులో నటించే ఆర్టిస్టుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం దీనిపై వర్కవుట్ చేస్తోన్నట్లు వివరించారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న ధోనికి తమిళంలో ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తొలత తమిళం మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత తెలుగు, మలయాళంలోనూ వరుసగా సినిమాలను తీస్తారని ప్రచారం జోరందుకుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి సినిమా ఉండొచ్చని చెబుతున్నారు.
దీనికోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తోంది. సాక్షి సింగ్ ధోనీ రాసిన ఓ కాన్సెప్ట్ ఆధారంగా ధోనీ తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ను మరింత డెవలప్ చేసే పనిలో ఉంది ధోని టీమ్.