Maheshwari Actress: 'వర్మ నన్ను మోసం చేశారు.. ఆ పని చేస్తే డబ్బులిస్తానని చెప్పి..': మహేశ్వరి
Maheshwari Actress: దెయ్యం సినిమా షూటింగ్ కోసం మేడ్చల్లోని ఓ ఫార్మ్ హౌస్లో స్మశానం సెట్ వేశారట.
Maheshwari Actress: నటీనటులను గుర్తుపెట్టుకోవాలంటే వారు చేసిన ఒక్క మంచి సినిమాలు చాలు.. చాలామంది హీరో, హీరోయిన్లు అతి తక్కువ కాలమే ఇండస్ట్రీలో ఉన్నా.. నటించింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకులపై ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్లిపోతారు. అలాంటి వారిలో ఒకరు మహేశ్వరి. తన గురించి చెప్పాలంటే ముందుకు ప్రారంభించాల్సింది 'గులాబి' సినిమాతోనే.
ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసుకున్న మహేశ్వరి.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాలతోనే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది. గులాబిలో అల్లరి పిల్లగా నటించిన మహేశ్వరి యాక్టింగ్కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. గులాబి తర్వాత తనకు అంతగా పేరు తెచ్చిపెట్టిన చిత్రం 'దెయ్యం'.
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు హారర్ సినిమాలకు పెట్టింది పేరు. అలా ఆయన తెరకెక్కించిన ఎన్నో మంచి హారర్ సినిమాల్లో దెయ్యం కూడా ఒకటి. ఈ సినిమాలో మహేశ్వరి హీరోయిన్గా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది మహేశ్వరి.
దెయ్యం సినిమా షూటింగ్ కోసం మేడ్చల్లోని ఓ ఫార్మ్ హౌస్లో స్మశానం సెట్ వేశారట. అక్కడి నుండి మెయిన్ రోడ్డుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఓ రోజు అర్ధరాత్రి షూటింగ్ జరుగుతున్న సమయంలో మెయిన్ రోడ్డు వరకు ఎవరు వెళ్లొస్తే వారికి రూ.50 వేలు ఇస్తానని ఆర్జీవీ ఛాలెంజ్ చేశారట. కానీ ఆ పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఫైనల్గా మహేశ్వరి ధైర్యం చేసి వెళ్లిచ్చినా.. వర్మ తనకు ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చింది.