Kottayam Pradeep: చిత్ర పరిశ్రమలో విషాదం.. కమెడియన్ మృతి..

Kottayam Pradeep:;

Update: 2022-02-17 09:15 GMT

Kottayam Pradeep: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కమెడియన్ ప్రదీప్ కేఆర్ (61) గుండెపోటుతో మరణించారు. ఎన్నో మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రదీప్‌ని అభిమానులు కొట్టాయం ప్రదీప్ అని పిలుచుకుంటారు. ప్రదీప్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మీ ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆయన ఫోటోని షేర్ చేశారు. అలాగే మిన్నాళ్ మురళీ ఫేమ్ టోవినో థామస్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్ట్ ఇన్ పీస్ అని పోస్ట్ చేశారు. నటి మాయను పెళ్లి చేసుకున్న ప్రదీప్‌కు ఇద్దరు సంతానం.

40 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ దాదాపు 70 చిత్రాల్లో నటించాడు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో అంతగా ప్రాముఖ్యంలేని పాత్రల్లో నటించాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన వినయ్‌తాండి వరువాయ సినిమాలో నటి త్రిషకు అంకుల్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


అక్కడి నుంచి వరుసగా ఆయనకు సినిమా ఆఫర్లు వచ్చాయి. 2016లో బెస్ట్ కామెడీ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. ప్రదీప్ చివరి చిత్రం 'ఆరట్టు'. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..

Tags:    

Similar News